సంగం బ్యారేజీ పేరు మార్చడం తప్ప ఏం చేశారు?: దేవినేని ఉమా

Devineni Uma asked CM Jagan what he did except changing the name of Sangam barrage. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పెండింగ్‌ ప్రాజెక్టులను

By అంజి  Published on  7 Sep 2022 7:01 AM GMT
సంగం బ్యారేజీ పేరు మార్చడం తప్ప ఏం చేశారు?: దేవినేని ఉమా

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి (ఎంజీఆర్) సంగం బ్యారేజీ పనులను 82% ప్రతిపక్ష నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు పూర్తి చేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

''సంగం బ్యారేజ్ పనులను చంద్రబాబు నాయుడు 82% పైగా పూర్తిచేస్తే.. 40నెలల్లో 10శాతం పనులు కూడా పూర్తి చేయకుండా రిబ్బన్ కటింగ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను భ్రష్టు పట్టించారు. సంగం పేరు మార్చడం తప్ప ఏం చేశారు? ఎవరి హయాంలో ఎంత ఖర్చుపెట్టారో చెప్పే ధైర్యం ఉందా?'' అంటూ సీఎం జగన్‌ను దేవినేని ప్రశ్నించారు.

''ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌ గత 40 నెలల్లో 10% పనులు కూడా పూర్తి చేయకుండా ఎంజీఆర్ సంగం, నెల్లూరు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు'' అని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం సంగం బ్యారేజీ పేరును మాత్రమే మార్చిందని దేవినేని ఉమ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ హయాంలో వివిధ ప్రాజెక్టులకు చేసిన ఖర్చులపై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సంగం-పొదలకూరు, నెల్లూరు-కోవూరు మధ్య సాఫీగా రవాణా చేసేందుకు నూతనంగా నిర్మించిన పెన్నా బ్యారేజీ-కమ్-రోడ్డు వంతెనను కూడా ఆయన ప్రారంభించారు. సంగం బ్యారేజీలో నిల్వ ఉన్న నీటితో 3.85 లక్షల ఎకరాలకు, నెల్లూరు బ్యారేజీ ద్వారా 99,525 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఎంజీఆర్‌ సంగం, నెల్లూరు బ్యారేజీల ద్వారా ఆత్మకూర్‌, కోవూరు, సర్వేపల్లి, కావలి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం జగన్‌ నిన్న చెప్పారు.

Next Story