రైతుల అకౌంట్లలోకి రూ.20 వేలు..గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

రైతులకు రూ.20 వేలు అందించే కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు

By Knakam Karthik
Published on : 29 Jun 2025 4:13 PM IST

Andrapradesh, Cm Chandrababu, Ap Government, Annadatha Sukhibhava Scheme

రైతుల అకౌంట్లలోకి రూ.20 వేలు..గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో అన్నదాతా-సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20 వేలు అందించే కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు జమ చేస్తుంది. అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాతా సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తుందని ప్రకటించారు. కేంద్రం మూడు విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాం. ప్రతి రైతుకు రూ.20 వేలు అందించేలా చర్యలు తీసుకుంటాం..అని సీఎం చంద్రబాబు టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో స్పష్టం చేశారు.

కాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు కలిపి ఆ రైతుల ఖాతాలో జమ చేయనుంది. 20 వేలను మూడు విడతలుగా జమ చేయనుంది. రైతుల భూములకు సంబంధించి ఇప్పటివరకు 98 శాతం ఈ కేవైసీ పూర్తి అయ్యింది. కేవలం రెండు శాతం మాత్రమే మిలిగి వుంది. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు అర్హులు. అలాగే అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులని స్వయంగా ప్రభుత్వం ప్రకటించింది.

Next Story