రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. శ్రీ లక్ష్మీ మహ యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకు చేరుకుని.. శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.