ఎల్లుండి సీఎం జగన్‌ ఒంగోలు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ 23వ తేదీన ఒంగోలు పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ఒంగోలు నగర పరిధిలోని

By Medi Samrat  Published on  21 Feb 2024 10:45 AM GMT
ఎల్లుండి సీఎం జగన్‌ ఒంగోలు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ 23వ తేదీన ఒంగోలు పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు మండలం ఎన్‌.అగ్రహారం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Next Story