ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నేడు విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అక్కడికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందని కలవనున్నారు. ఆ తర్వాత ఉదయం 11.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు జగన్.