ఢిల్లీ చేరుకున్న సీఎం జ‌గ‌న్‌.. రేపు మధ్యాహ్నం వ‌ర‌కూ బిజీబిజీ..

CM YS Jagan Delhi Tour. ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో

By Medi Samrat  Published on  10 Jun 2021 10:08 AM GMT
ఢిల్లీ చేరుకున్న సీఎం జ‌గ‌న్‌.. రేపు మధ్యాహ్నం వ‌ర‌కూ బిజీబిజీ..

ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ తదితరులను కలవనున్నారు.

సీఎం జగన్ తన పర్యటనలో భాగంగా మొదట గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. పోలవరం నిధులు, పెండింగ్ అంశాలను ఆయనతో చర్చించనున్నారు. పోలవరం సహా పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. అనంత‌రం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం కానున్నారు. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో కీలక భేటీ జరగనుంది. రాష్ట్రాభివృద్ధికి చెందిన అనేక కార్యక్రమాలపై కేంద్రం సహకారాన్ని కోరనున్నారు.

ఇక చివరగా రేపు ఉదయం రైల్వే మంత్రి పియూష్ గోయల్ తో సమావేశమ‌వ‌నున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ఏపీకి తిరుగు ప‌య‌న‌మ‌వుతారు. సీఎం జ‌గ‌న్‌ వెంట వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలశౌరి ఢిల్లీకి వెళ్లారు.


Next Story