రేపు సీఎం జ‌గ‌న్‌ సూళ్ళూరుపేట పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ రేపు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat
Published on : 20 Nov 2023 8:45 PM IST

రేపు సీఎం జ‌గ‌న్‌ సూళ్ళూరుపేట పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ రేపు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జ‌గ‌న్ పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలు చేయ‌డంతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేర‌కు అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేశారు.

మంగ‌ళ‌వారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తడ మండలం మాంబట్టు ఎస్‌ఈజెడ్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. అక్క‌డ‌ పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంత‌రం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ప్ర‌త్యేక విమానంలో తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story