ఎల్లుండి సీఎం జ‌గ‌న్ పామర్రు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ ఎల్లుండి (29వ తేదీ) కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  27 Feb 2024 9:00 AM GMT
ఎల్లుండి సీఎం జ‌గ‌న్ పామర్రు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ ఎల్లుండి (29వ తేదీ) కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జగనన్న విద్యా దీవెన నగదు బటన్‌ నొక్కి విద్యార్ధుల త‌ల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేయనున్నారు. ఈ మేర‌కు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో అధికారులు విడుద‌ల చేశారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పామర్రు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంత‌రం జగనన్న విద్యా దీవెన న‌గ‌దును బటన్‌ నొక్కి విద్యార్ధుల త‌ల్లుల ఖాతాల్లో జమచేస్తారు. కార్య‌క్ర‌మం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Next Story