రేపు సీఎం జ‌గ‌న్‌ కర్నూలు జిల్లా పర్యటన

CM Jagan will visit Kurnool district tomorrow. సీఎం వైఎస్‌ జగన్ మంగ‌ళ‌వారం నాడు కర్నూలు జిల్లా అదోనిలో ప‌ర్య‌టించ‌నున్నారు.

By Medi Samrat  Published on  4 July 2022 7:52 AM GMT
రేపు సీఎం జ‌గ‌న్‌ కర్నూలు జిల్లా పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ మంగ‌ళ‌వారం నాడు కర్నూలు జిల్లా అదోనిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు ప‌ర్య‌ట‌న వివ‌రాలు వెల్ల‌డించారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు సీఎం బయలుదేరుతారు. అక్క‌డి నుండి విమానంలో 10.20 గంటలకు ఆదోని చేరుకుంటారు. 10.40 గంటలకు ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌ చేరుకుని స్కూల్‌ను పరిశీలించిన అనంతరం అక్కడి గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.50 గంటలకు ఆదోని నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.







Next Story