CM Jagan will visit Dendulur of Eluru district tomorrow
రేపు సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్ ఆసరా ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 – 12.35 గంటల వరకూ జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు దెందులూరు నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.