రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

CM Jagan Visits Delhi Toomorrow. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on  1 Jun 2022 10:49 AM GMT
రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11:30 గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వన్‌ జనపద్‌కు చేరుకోనున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు, పోలవరానికి నిధులు, తదితర అంశాలపై కేంద్రమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ చర్చించే అవకాశం ఉంది.






Next Story