రాష్ట్రానికి మరో 25,000 ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ అయిన క్రియేటర్‌ ల్యాండ్‌ను రాజధాని అమరావతిలో ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.

By అంజి
Published on : 4 May 2025 10:50 AM IST

CM Chandrababu, AP government, Creative Land Asia, APnews

రాష్ట్రానికి మరో 25,000 ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

అమరావతి: భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ అయిన క్రియేటర్‌ ల్యాండ్‌ను రాజధాని అమరావతిలో ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం క్రియేటివ్‌ ల్యాండ్‌ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేశారు.

''భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ అయిన క్రియేటర్‌ల్యాండ్‌ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం క్రియేటివ్‌ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో, ఈ ప్రాజెక్ట్ ఎఫ్‌డీఐని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ & క్రియేట్ ఫర్ ది వరల్డ్‌కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉంది'' అని సీఎం చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్‌షిప్ చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, స్టోరీ టెల్లింగ్‌, AI-ఆధారిత కంటెంట్‌కు కేంద్రంగా ఉంటుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు, మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్‌ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మక, డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story