కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..బాధ్యులపై కఠిన చర్యలకు నిర్ణయం

కల్తీ పాలు తాగి ప్రజలు అస్వస్థతకు గురికావడం మరియు మరణాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 3:44 PM IST

Andrapradesh, Cm Chandrababu, Rajahmundry, Milk Adulteration, Health Review, AP Government

కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..బాధ్యులపై కఠిన చర్యలకు నిర్ణయం

రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ప్రజలు అస్వస్థతకు గురికావడం మరియు మరణాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పాలు వినియోగించిన సుమారు 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ రిపోర్టులు వచ్చిన వెంటనే బాధ్యులైన పాల విక్రయదారులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులకు సూచించారు.

Next Story