సీఎం చంద్రబాబు మరోమారు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. బుధవారం జరిగిన శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకాగా.. ఈ నెల 22, 23 తేదీల్లో మరోయారు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. 22 తేదీ ఉదయం 8.15 గంటలకు విజయవాడ నుంచి పుట్టపర్తికి బయలుదేరుతారు. 10.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలుకుతారు. 11 గంటలకు ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలుకుతారు. అనంతరం 3.50 గంటలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి హాజరవుతారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేస్తారు. 23 తేదీ ఆదివారం 9 గంటలకు శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. పుట్టపర్తి నుంచి బయల్దేరి మద్యాహ్నం 1 గంటకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తిరిగి వస్తారు.