ఆ ప్రమాదం పొంచి ఉంది.. అధికారుల‌ను అల‌ర్ట్ చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ పై ఆరా తీశారు.

By Medi Samrat  Published on  4 Sep 2024 12:13 PM GMT
ఆ ప్రమాదం పొంచి ఉంది.. అధికారుల‌ను అల‌ర్ట్ చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ పై ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు వేగంగా విద్యుత్‌ను పునరుద్ధరించాలని చంద్రబాబు నాయుడు అధికారులను కోరారు. వైరల్ ఫీవర్ ప్రబలే ముప్పు ఉన్నందున ఆయా వార్డుల వారీగా వైద్య శిబిరంతోపాటు కరపత్రాల ద్వారా ప్రజలకు ఈ ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన సంఘటనలలో మరణించిన 20 మంది వ్యక్తుల బంధువులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించారు. వర్షాలు, వరదల కారణంగా విజయవాడలో ఇప్పటివరకు 20 మంది మరణించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో, ముఖ్యమంత్రి వారి మృతదేహాలను అప్పగించడానికి ఆయా వ్యక్తుల కుటుంబాలను గుర్తించాలని లేదా ప్రభుత్వం తరపున అంత్యక్రియలు చేయాలని ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల నష్టపరిహారం అందజేయండని అధికారిక పత్రికా ప్రకటనలో చంద్రబాబు నాయుడు సూచించారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఇంటింటికీ వెళ్లి సాయం చేసేందుకు అవకాశం ఉందన్నారు. నీరు, బిస్కెట్లు, పండ్లు, పాలు వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. కూరగాయలను తక్కువ ధరకు విక్రయించేందుకు మొబైల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story