పవన్ కళ్యాణ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

By Medi Samrat
Published on : 3 March 2024 6:30 PM IST

పవన్ కళ్యాణ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పలువురు నాయకులు పార్టీలు మారడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వైసీపీ నేతలు టీడీపీ లోనూ.. టీడీపీ నేతలు వైసీపీ బాట పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతూ ఉండగా.. హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశమయ్యారు.

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం ఇటీవల నియమించింది. ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని సమాచారం. శ్రీనివాసులు త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతోనే శ్రీనివాసులు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Next Story