లేని కేసు గురించి అడగడం విడ్డూరంగా ఉంది

Chinarajappa Fires On CM YS Jagan. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అప్పగిస్తే కక్ష సాధింపు చర్యలకు

By Medi Samrat
Published on : 26 Oct 2021 5:02 PM IST

లేని కేసు గురించి అడగడం విడ్డూరంగా ఉంది

రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అప్పగిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. జగన్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిని అక్రమ అరెస్టులు చేయడం.. జైల్లో పెట్టడం ఆంధ్రప్రదేశ్ లో నిత్యకృత్యంగా మారింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర పరిస్థితి గురించి వివ‌రించ‌డానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని, లా అండ్ ఆర్డర్ స‌మ‌స్య‌ల‌పై కేంద్ర‌మంత్రి అమిత్ షా ను కలిస్తే.. ఓటుకు నోటు కేసులో ఉన్న చంద్రబాబు ఎలా కలుస్తారని అడుగుతున్నారని.. ఓటుకు నోటు అనే కేసు అనేది ఎక్కడ ఉంది.. లేని కేసు గురించి అడగడం విడ్డూరంగా ఉందని చినరాజప్ప అన్నారు. ఎ1, ఎ2 లు ప్రధాన మంత్రిని తమ స్వప్రయోజనల కోసం పదే పదే కలుస్తున్నారు. మరి దీనికి ఏమి సమాధానం చెబుతారని వ్య‌వ‌సాయ మంత్రి కన్నబాబుని చిన‌రాజప్ప ప్రశ్నించారు.


Next Story