అమరావతి: ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం..క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తాం..అని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్" కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. సామర్ధ్యాలు, వేగం, కచ్చితత్వం లాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుంది.
ఓ ట్రాన్సఫర్మేషనల్ ఛేంజ్ క్వాంటం ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉంది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారధ్యం వహిస్తుంది. ఎవరినీ అనుసరించదు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి. క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తాం..అని సీఎం పేర్కొన్నారు.
నవంబరు 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిపుణుల్ని తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. క్వాంటం రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్నే సిద్దం చేసుకున్నాం. లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యం. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగానే వన్ ఐటీ, ఏఐ యూజ్ కేస్ ద్వారా వీటి విస్తృతిని పెంచుతున్నాం.
క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్ధులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారు. విజన్ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులను కోరుతున్నాను. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్. అమరావతిలో క్వాంటం వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తూ ఎకోసిస్టంగా తీర్చిదిద్దుతున్నాం..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.