నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. లేఖ రాసిన ఆయన నిన్నటి వరకు తనపై ఎఫ్ఐఆర్ కూడా లేదని, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పానని, లుకౌట్ నోటీసులు ఎందుకిచ్చారో తెలియదని అన్నారు. విచారణలో కనీసం తన అభిప్రాయం కూడా తీసుకోలేదన్నారు చెవిరెడ్డి.
భర్త అరెస్టుపై చెవిరెడ్డి సతీమణి లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్ట్ విషయం తెలియగానే ఆయన సతీమణి లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఏ తప్పూ చేయలేదని, ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ అరెస్ట్కు నిరసనగా ఆమె అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఏ తప్పు చేయని చెవిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని లక్ష్మి అన్నారు.