వింత వ్యాధిపై ముఖ్య‌మంత్రి జగన్‌కు చంద్రబాబు లేఖ..

Chandrababu Letter To Jagan. ముఖ్యమంత్రి జగన్ కి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

By Medi Samrat  Published on  9 Dec 2020 10:42 AM GMT
వింత వ్యాధిపై ముఖ్య‌మంత్రి జగన్‌కు చంద్రబాబు లేఖ..

ముఖ్యమంత్రి జగన్ కి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు అస్వ‌స్థ‌త‌కు గురవుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఏలూరు ప‌రిధిలో ఆరోగ్య అత్య‌యిక ప‌రిస్థితి ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. రోజుకో రీతిలో రోగుల్లో ల‌క్ష‌ణాలు మారిపోవ‌డంపై ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొంటున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఏలూరులో జనజీవనం అల్లకల్లోలం కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. గ‌త ఐదారు రోజుల్లో ఆరేడు వందల మంది ఆసుపత్రుల పాలు కావడం విషాదకరమన్నారు. రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై భయాందోళనలు నెల‌కొన్నాయ‌ని.. భాదితుల‌కే కాదు. వారికి సేవ‌లు అందించే సిబ్బందికి కూడా అవే ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డ‌టం, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం ఆందోళ‌న‌క‌రమ‌న్నారు.

సురక్షిత తాగునీరు పొందడం ప్రజల పౌరహక్కు అని.. తాగునీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యమని లేఖలో తెలిపారు. నీటిని పొందే హక్కు పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తుచేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21కూడా అదే నిర్దేశించిందన్నారు. సురక్షిత నీటి సరఫరాలో, పారిశుద్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం శోచనీయమని విమర్శించారు. ఏలూరు దుర్ఘటనలకు కారణాలు ఏమిటి..? ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మూలాల అన్వేషణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన పరీక్షల వివరాలను ప్రజలకు వెల్లడించాలని చంద్రబాబు కోరారు. తద్వారా బాధితుల్లో నమ్మకం పెంచాలని.. వారి విశ్వాసం పొందాలని.. ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని సూచించారు. రేపు ఏమి జరుగుతుందోననే భయాందోళనలను తొలగించాలన్నారు. ప్రజారోగ్యంపై భరోసా పెంచాలని లేఖలో వెల్లడించారు. ఏలూరులో ''ఆరోగ్య అత్యవసర పరిస్థితిని'' తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాగునీటిలో లెడ్, నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోందని అన్నారు.దీని వల్ల గర్భిణులు, చిన్నారులు, వృద్దుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఏలూరులో ప్రతిఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులను అందజేయాలని... దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించాలన్నారు.

జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఏలూరు దుర్ఘటనపై సైంటిఫిక్ స్టడీ చేయాలని చంద్రబాబు తెలిపారు.''హెల్ప్ లైన్'' ఏర్పాటు చేయాలనే ఆలోచన రాకపోవడం మరో వైఫల్యమని మండిపడ్డారు.తక్షణమే బాధితుల కోసం ''ప్రత్యేకమైన కంట్రోల్ రూం'' ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి లక్షణాలున్న రోగులందరికి అత్యుత్తమ వైద్యం అందించాలని చెప్పారు.ఎక్కడికక్కడ ''క్విక్ రెస్పాన్స్ టీములను'' ఏర్పాటు చేయాలని.... సత్వర ఉపశమన చర్యలు, సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హుద్ హుద్ తరహాలో ''మొబైల్ మినరల్ వాటర్ ప్లాంట్లను'' ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బాధితుడికి ఆరోగ్య బీమాతో పాటు, జీవిత బీమా కల్పించాలన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణపై వారిలో అవగాహన పెంచాలని తెలిపారు.


Next Story