ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్న పవన్‌, చంద్రబాబు

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గురువారం న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర నేతలతో సీట్ల పంపకంపై చర్చలు జరపనున్నారు.

By అంజి  Published on  7 March 2024 3:00 AM GMT
Chandra babu Naidu, Pawan kalyan,BJP leaders, Delhi, seat sharing, APnews

ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్న పవన్‌, చంద్రబాబు

విజయవాడ : ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపాదిత 3 పార్టీల పొత్తుపై తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర నేతలతో సీట్ల పంపకంపై చర్చలు జరపనున్నారు. ఏపీ నేతలు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ, జనసేనలు తమ పోటీదారుల తొలి జాబితాను ఇటీవల ప్రకటించినప్పటికీ బీజేపీతో సీట్ల పంపకంపై చర్చ జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను నమోదు చేయగా, 24 స్థానాలకు గానూ జనసేన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 స్థానాలకు గాను మిగిలిన 76 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ ఇంకా పేర్లను ప్రకటించలేదు.

జనసేనకు మూడు ఎంపీ నియోజకవర్గాలు దక్కనుండగా, మొత్తం 25 ఎంపీ స్థానాల్లో మిగిలిన స్థానాలకు టీడీపీ పేర్లను ప్రకటించనుంది. అంతకుముందు అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు సమావేశమైనప్పటికీ, సీట్ల పంపకంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం, బిజెపి అగ్ర నాయకత్వం అనేక దక్షిణాది రాష్ట్రాల నాయకులతో చర్చలు జరుపుతోంది. బీజేపీ రెండవ పోటీదారుల జాబితాను త్వరలో విడుదల చేయనున్నారు. 545 లోక్‌సభ స్థానాల్లో జాతీయ కూటమి 400కు పైగా గెలవాలని బీజేపీ భావిస్తున్నందున టీడీని మళ్లీ ఎన్డీయేలో చేర్చుకునే ప్రతిపాదనపై కూడా నేతలు చర్చించే అవకాశం ఉంది.

Next Story