ఏపీలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా

771 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat  Published on  28 Sep 2021 2:47 PM GMT
ఏపీలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,592 పరీక్షలు నిర్వహించగా.. 771 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఎనిమిది మంంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,150కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,333 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,22,168కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,912 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,81,78,305 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story