వైసీపీ నేతల చీప్ ట్రిక్స్ను చూస్తూ ఊరుకోను..మంత్రి సవిత వార్నింగ్
సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులపై వైసీపీ నేతలకు ఏపీ మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు.
By - Knakam Karthik |
అమరావతి: సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులపై వైసీపీ నేతలకు ఏపీ మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు తన పేరుతో మార్ఫింగ్ పెట్టి సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేస్తున్నారు..అని మంత్రి సవిత ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల చీప్ ట్రిక్స్ ను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నాపై సోషల్ మీడియాలో పెట్చిన పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశా. వైసీపీ నేతలు చీప్గా వ్యవహరించడాన్ని ఆపాలి. పీపీ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తుంటే... ప్రైవేటు పరం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మెడికల్ కళాశాలలపై చర్చించేందుకు మేము సిద్దంగా ఉన్నాం. తిరుమలలో దర్శనాల పేరిట వైసీపీ నేత రోజా అక్రమ దందాలన్నీ చర్చించేందుకు సిద్దం. ఐదేళ్లపాటు వైసీపీ నేత రోజా చేసిన అవినీతి అక్రమాలపై చర్చకు సిద్దం.
ఈ సారైనా పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలి. వైసీపీ నేతలంతా కలసి పులివెందుల ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపాలి. పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తే మాట్లాడేందుకు మైక్ ఇస్తాం. ఏ అంశంపైనా సరే అసెంబ్లీలో చర్చించేందుకు మేము సిద్దంగా ఉన్నాం. యూరియా, మెడికల్ కళాశాలలు, వివేకా గొడ్డలి వేటుపై చర్చించేందుకు మేము సిద్దం. సూపర్ సిక్స్ అమలు చేసి సూపర్ హిట్ చేశాం. మళ్లీ అమరావతి రాజధాని అంటూ మోసం చేసేందుకు వైసీపీ వారు డ్రామా ఆడుతున్నారు. తిరుపతిలో పదేళ్లుగా విగ్రహం అక్కడే ఉందని తెలిసినా... వైసీపీ వాళ్లు దుష్ర్పచారం చేస్తున్నారు..అని మంత్రి సవిత సీరియస్ అయ్యారు.
బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తాం..
బీసీ స్టడీ సర్కిళ్లు ద్వారా బీసీ అభ్యర్థులకు డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాం. 1674 మందికి బీసీ స్టడీ సర్కిళ్లలో, ఆఫ్ లైన్ లో 4770 మందికి శిక్షణ ఇచ్చాం. మొత్తం 6470 మందికి బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చాం. డీఎస్సీలో 246మంది అభ్యర్థులు డీఎస్సీ ద్వారా టీచర్లుగా ఎంపికయ్యారు . బీసీ స్టడీ సర్కిళ్లద్వారా సివిల్ సర్వీసెస్ , గ్రూప్స్, ఆర్ఆర్బీకి ఉచిత కోచింగ్ ఇచ్చాం. భవిష్యత్తులో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తాం. నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు వచ్చేలా చేసినందుకు బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చింది. ఈనెల 20న బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు అవార్డు తీసుకోబోతున్నారు. జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు రావడం ఆనందంగా ఉంది..అని మంత్రి సవిత పేర్కొన్నారు.