రైతులకు అన్నదాత సుఖీభవ సాయం.. మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఏడాది కాలంలో సూపర్ సిక్స్ లో హామీలను 85 శాతం వరకు అమలు పూర్తి చేశామని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు

By Medi Samrat
Published on : 14 Jun 2025 4:23 PM IST

రైతులకు అన్నదాత సుఖీభవ సాయం.. మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఏడాది కాలంలో సూపర్ సిక్స్ లో హామీలను 85 శాతం వరకు అమలు పూర్తి చేశామని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బందరు రోడ్డులో మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. కూటమి సర్కార్ ఏడాది పాలనలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ముందుకు తీసుకెళ్లుతున్నామన్నారు. గత ప్రభుత్వం వారసత్వంగా 10 లక్షల కోట్ల అప్పుల గంప మాకు అందించిందని, అయినా వెనక్కి తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు ఏడాది పాలనలో 85 శాతం అమలు చేసారన్నారు. ఇది మా ముఖ్యమంత్రి చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా మా ప్రభుత్వం 15 శాతం అభివృద్ధి లక్ష్యంతో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.

గత ప్రభుత్వంలో అమ్మ ఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికి మాత్రమే అందించగా మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. రేపు, ఎల్లుండి కూడా తల్లుల ఖాతాల్లో డబ్బులు పడతాయన్నారు. తల్లికి వందనం పథకం ఇంత పెద్ద ఎత్తున ఎవరూ అమలు చేయలేదన్నారు. అసెంబ్లీకి రాని వారు దేశంలో కేవలం ఆ పార్టీ లో మాత్రమే ఉన్నారన్నా రు. ఒక వేళ వచ్చినా వాళ్ల సొంత పనుల కోసం వస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు పట్టవన్నారు. తల్లికి వందనం డబ్బులు రెండు వేలు మంత్రి నారా లోకేష్ జేబులో వేసుకుంటున్నారని అన్నారని దానికి లోకేష్ సవాల్ విసిరారని అందుకు సిద్ధమా అని అడిగారు. ఏడాదిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ. 34 వేల కోట్లు అందించామన్నారు. ఆరోపించిన వారు పథకాల ఏమి ఇచ్చారో తెలుసుకోవాల న్నారు.

గతంలో కంటే సంక్షేమ రంగానికి ఎక్కువగా నిధులు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. అన్నదాత సుఖీభవ క్రింద రైతన్నకు ఈ నెలలోనే సాయం అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో యావరేజ్ గా ప్రతి కుటుంబానికి రూ. 30,000 అందించగా, మేము ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ ద్వారా రూ. 1.04 లక్షల రూపాయలు అందించామన్నారు. గత ప్రభుత్వంలో పిల్లల భవిష్యత్ గురించి కనీసం ఆలోచించలేదన్నారు. మేము వారి భవిష్యత్ గురించి ఆలోచించి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని దాని ద్వారా దాదాపు 8 లక్షల పైచిలుకు ఉద్యోగాలు వచ్చాయన్నారు.

గత ప్రభుత్వ పాలనలో మేనిఫెస్టో బైబిల్, ఖురాన్ అని, ప్రజలను గాలికి వదిలేచారని, వారి భవిష్యత్ గురించి ఆలోచించలేదన్నారు. తల్లికి వందనం, ఫీజ్ రియంబర్స్ మెంటు ఇస్తున్నామన్నారు. మేము పిల్లలును చదివించి వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇచ్చే లా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు అన్నీ అమలు చేస్తున్నామన్నారు. మేము సామాన్యులను ఎక్కడా కేసులు పెట్టి వేదించడం లేదన్నారు. గత ప్రభుత్వం అవగాహన రాహిత్యం తో ఈ పని చేసిందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని దేవుడి నీ కోరుకుంటున్నామన్నారు.. ప్రభుత్వ సహకారంతో వారు చదువుకుని భయటకు వచ్చిన తరువాత వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు, అందుకు పెట్టుబడులు తెస్తున్నామన్నారు. అంతేకాకుండా వారికి నైపుణ్యాభివృద్ధి లో శిక్షణ అందిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు వల్ల రాష్ట్రం నుండి పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు పారిపోయారన్నారు.. అందులో అశోక్ లైలాండ్, అమర్ రాజా లాంటి తదితర సంస్థలు ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు అన్ని రంగాల్లో సమాన సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో తల్లికి వందనం లబ్ధిదారులైన తల్లులు, పిల్లలతో కలసి మంత్రి కేకు కట్టు చేశారు.

Next Story