కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన ఏపీ మంత్రి

AP Minister Gowtham Reddy Meet With Kishan Reddy. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్

By Medi Samrat  Published on  12 Nov 2021 5:16 AM GMT
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన ఏపీ మంత్రి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్ర‌వారం సమావేశమయ్యారు. ఈ భేటీలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై మంత్రి మేకపాటి కేంద్రమంత్రికి ప్రతిపాదనలను సమర్పించారు. సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశం గల ప్రాంతాల గురించి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కిష‌న్ రెడ్డికి వివరించారు. సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతిపత్రం అంద‌జేశారు. అయితే.. ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాలపై కేంద్ర మంత్రి ఆరా తీసిన‌ట్లు తెలుస్తోంది. టెంపుల్ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి మేకపాటి.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి తెలిపారు.


Next Story