ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం అమలుపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా ఉద్దండపురంలో మాట్లాడుతూ, స్కూళ్లు రీ-ఓపెన్ అయిన తర్వాత జూన్ 15, 2025 లోపు ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా, ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 చొప్పున అందజేస్తామని ఆమె తెలిపారు.
అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నాటికి ప్రారంభం కానున్నట్లు ఆమె చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం ఉద్ధండపురం గ్రామంలో పర్యటించిన ఆమె రెండు పథకాలపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఆదివారం(జూన్ 01) సెలవు కావడంతో ఫించన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన మంత్రి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఓ లబ్ధిదారుని ఇంట్లోకి వెళ్లి స్వయంగా టీ కాచి అందరికీ అందించారు. ఆ తర్వాత వారితో కాసేపు ముచ్చటించారు.