మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన క్వాష్పిటీషన్పై విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను డిస్మిస్ చేసింది ధర్మాసనం. పోలీసులు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి కోర్టును ఆశ్రయించారు. అయితే పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.