పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. షరతులు ఇవే.!

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది

By Medi Samrat  Published on  23 Aug 2024 2:45 PM GMT
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. షరతులు ఇవే.!

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసుల్లో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలని, పాస్ పోర్టును అప్పగించాలని షరతులు విధించింది. ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని ఆదేశించింది ధర్మాసనం. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. పిన్నెల్లి విడుదలవుతున్న నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు.

పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. జూన్ 26వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు. మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వాయిగేటు 202, 7 నంబర్ పోలింగ్ స్టేషన్లల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడినందు వల్లే సంబంధిత ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.

Next Story