ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పేద‌ల‌కు 10కేజీల‌ ఉచిత బియ్యం

AP Govt Takes Key Decision. ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు

By Medi Samrat  Published on  26 April 2021 3:50 PM GMT
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పేద‌ల‌కు 10కేజీల‌ ఉచిత బియ్యం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సీఎం వైస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మే, జూన్‌ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం అందించనుంది. కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. సీఎం జగన్‌ నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఇచ్చే రేషన్‌ బియ్యంతో 88 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 59 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.


Next Story