జూనియర్ డాక్టర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Govt Good News to Junior Doctors. స్టయిఫండ్ పెంచకపోతే సమ్మెకు దిగుతామంటూ ఏపీలో జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి నోటీసులు పంపగా.

By Medi Samrat  Published on  21 Oct 2022 2:00 PM GMT
జూనియర్ డాక్టర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

స్టయిఫండ్ పెంచకపోతే సమ్మెకు దిగుతామంటూ ఏపీలో జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి నోటీసులు పంపగా.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టయిఫండ్ పెంపుపై జూనియర్ డాక్టర్లకు శుభవార్త చెప్పింది. ఎంబీబీఎస్ ఇంటర్నీస్ స్టయిఫండ్ ను రూ.19,589 నుంచి రూ.22,527కి పెంచారు. పీజీ మూడో సంవత్సరం మెడికోలకు రూ.46,524 నుంచి రూ.56,319కి పెంచారు. ఎండీ ఫైనలియర్ వారికి రూ.48,973 నుంచి రూ.56,319కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 27 నుంచి ఎమర్జెన్సీ సేవలు మినహా, మిగిలిన అన్ని వైద్యసేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. కీలక ఆదేశాలను జారీ చేసింది.


Next Story