AP: సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త.. శాలరీ ఎంత పెరిగిందంటే?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న

By అంజి  Published on  18 April 2023 6:53 AM GMT
AP govt, Village secretariat employees , APnews, CM YS Jagan

AP: సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త.. శాలరీ ఎంత పెరిగిందంటే?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారికి శుభవార్త అందించింది. రెండో విడత నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 17) ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారందరూ ప్రస్తుతం నెలకు రూ.15,000 వేతనం పొందుతున్నారు. ప్రొబేషన్‌ పూర్తయిన గ్రేడ్‌ 5 పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు ప్రస్తుతం అందుకుంటున్న కనీస బేసిక్‌ వేతనం రూ. 23,120 కాగా.. డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిపిన తర్వాత వారి జీతం రూ. 29,598 పెరుగుతుంది.

మిగిలిన 17 శాఖల ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిపి రూ.22,460 అందుతుండగా మే 1 నుండి రూ. 28,753 లభిస్తుంది. అంటే జూన్ 1న ఉద్యోగులకు పెరిగిన జీతం లభిస్తుంది. మొదటి దశలో భర్తీ చేయకుండా మిగిలిపోయిన పోస్టులకు 2020లో రెండవ నోటిఫికేషన్ జారీ చేయబడింది. 12,837 మందికి ఉద్యోగాలు లభించాయి. మొదటి బ్యాచ్‌లోని మిగిలిన ఉద్యోగులు నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ పొందుతారు. ప్రొబేషన్ ఖరారుతో వీరందరికీ జీతం రెట్టింపు కానుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏ స్లాబు ప్రకారం.. కొంతమందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది.

పెరిగిన వేతనాలు జూన్‌ 1వ తేదీన ఉద్యోగులకు అందే జీతంతో అమలులోకి వస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story