ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

By Medi Samrat
Published on : 25 March 2025 8:45 PM IST

ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పన్ను బకాయిదారులకు రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పన్ను చెల్లించేవారికి వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ నిర్ణయంతో కోట్లాది రూపాయల బకాయిలు వసూలు అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఆస్తి పన్నుపై వడ్డీ బకాయిల్లో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈనెల ఆఖరు వరకు పెండింగ్ లో ప్రాపర్టీ టాక్స్ వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. కొన్నేళ్లుగా పేరుకు పోయిన కోట్లాది రూపాయల బకాయిలు వసూలు అవుతాయని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

Next Story