స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
By Knakam Karthik
స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
స్వర్ణాంధ్ర-2047 సాధన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర సాధన కోసం ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ టాస్క్ఫోర్స్ ఏర్పాటు కానుంది. కో చైర్మన్గా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.
టాస్క్ఫోర్స్ సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో హాస్పిటల్ ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్ రాజిరెడ్డి, సతీష్ రెడ్డి, జీఎం రావు , ఎల్ఎండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్, ఏపీ సీఎస్ విజయానంద్ ఉంటారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు.
పారిశ్రామిక అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేసేలా ఈ టాస్క్ఫోర్స్ పని చేయనుంది. పారిశ్రామిక అవసరాలను అనుగుణంగా ఈ బ్లూ ప్రింట్ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.