స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

By Knakam Karthik
Published on : 10 Jun 2025 2:15 PM IST

Andrapradesh, Swarnandhra-2047, AP Government, Cm Chandrababu, TaskForce

స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్వర్ణాంధ్ర-2047 సాధన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర సాధన కోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ టాస్క్‌ఫోర్స్ ​ఏర్పాటు కానుంది. కో చైర్మన్‌గా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.

టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్ ​బెనర్జీ, అపోలో హాస్పిటల్ ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్​ రాజిరెడ్డి, సతీష్ రెడ్డి, జీఎం రావు , ఎల్​ఎండ్ టీ చైర్మన్ ​సుబ్రహ్మణ్యన్​, ఏపీ సీఎస్ ​విజయానంద్​ ఉంటారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

పారిశ్రామిక అభివృద్ధికి బ్లూ ప్రింట్‌ తయారు చేసేలా ఈ టాస్క్‌ఫోర్స్ పని చేయనుంది. పారిశ్రామిక అవసరాలను అనుగుణంగా ఈ బ్లూ ప్రింట్‌​ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Next Story