రైతులకు గుడ్‌న్యూస్‌.. 'అన్నదాతా సుఖీభవ' డబ్బుల జమ ఎప్పుడంటే?

అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల పెట్టుబడి కోసం రూపొందించిన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌' పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

By అంజి
Published on : 7 Jun 2025 6:41 AM IST

AP government, Annadatta Sukhibhava scheme, APnews, Farmers

రైతులకు గుడ్‌న్యూస్‌.. 'అన్నదాతా సుఖీభవ' డబ్బుల జమ ఎప్పుడంటే?

అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల పెట్టుబడి కోసం రూపొందించిన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌' పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. జూన్‌ 20న పీఎం కిసాన్‌ డబ్బు రూ.2 వేలకు .. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.5 వేలు కలిపి జమ చేయనున్నట్టు తెలుస్తోంది.

అక్టోబర్‌లో రెండో విడత, వచ్చే జనవరిలో మూడో విడత జమ చేస్తారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. రెండో విడతలో రాష్ట్ర సర్కార్‌ రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు, మూడో విడతలో రాష్ట్ర సర్కార్‌ రూ.4 వేలు.. కేంద్రం రూ.2 వేలు కలిపి రూ.6 వేలు పంపిణీ చేస్తాయి. పీఎం కిసాన్‌ డబ్బు జమ తేదీ మారితే.. దానికనుగుణంగా ఈ తేదీ కూడా మారే అవకాశం ఉంది. ఈ పథకానికి 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించారు.

అయితే వీరిలో ఈ కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లో మాత్రమే నిధుల జమ ఉంటుందని. అడవి పట్టా భూములు పొందిన వారికి కూడా ఈ పథకానికి అర్హులు. అటు కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పంటకాలం మొదలైన తర్వాత అర్హుల జాబితాను ప్రభుత్వం గుర్తించనుంది. వారికి గుర్తింపు కార్డులు ఇచ్చిన తర్వాత అన్నదాతా సుఖీభవ నిధులను ప్రభుత్వం ఇవ్వనుంది.

Next Story