అమరావతి రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నెల 29న రాజధాని రైతులకు మలి విడత ప్లాట్లను కేటాయించనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ఉండనుంది. కాగా నిబంధనల ప్రకారం లాటరీ విధానంలోనే అధికారులు రైతులకు ప్లాట్లను కేటాయించనున్నారు. అయితే ఈ నెల 28వ తేదీకి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.