సంచలన నిర్ణయం తీసుకున్న జీవీ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ చైర్మన్ జివి.రెడ్డి తన శాఖలోని ముగ్గురు ఉన్నతాధికారుల సేవలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on  20 Feb 2025 8:45 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న జీవీ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ చైర్మన్ జివి.రెడ్డి తన శాఖలోని ముగ్గురు ఉన్నతాధికారుల సేవలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సేవల నుంచి తొలగించిన ముగ్గురిలో ఫైబర్‌నెట్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేష్, ప్రొక్యూర్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, ఏపీ ఫైబర్‌నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు భరద్వాజ ఉన్నారు.

ఫైబర్‌నెట్‌ విభాగంలోని 410 మంది రెగ్యులర్‌ ఉద్యోగులను తొలగిస్తూ గత డిసెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసినా ఫైబర్‌నెట్‌ ఎండీ, ఈడీలు కాగితాలపై సంతకాలు చేయకపోవడంతో ఆ నిర్ణయం అమలు కాలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి తొలగించిన ఉద్యోగులకూ జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైబర్ నెట్ లో సంస్కరణలు ప్రతిపాదిస్తూ 400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఆదేశాలపై ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదన్నారు. ఇటీవల జీఎస్టీ అధికారులు ఫైబర్ నెట్ కు రూ.377 కోట్లు జరిమానా విధించిన విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. ఈ తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఎండీ దినేశ్ కుమార్ ఒక్క ఆపరేటర్ ను కూడా కలవడం లేదని, కనీసం సిబ్బందికి టార్గెట్లు కూడా పెట్టడంలేదని జీవీ రెడ్డి ఆరోపించారు. అందుకే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

Next Story