సాయంత్రం క‌ల్లా ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం లభిస్తుంది : మంత్రి బొత్స

AP employees problems will be resolved by today evening, says Botsa Satyanarayana. ఈరోజు సాయంత్రంలోగా ఏపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని

By Medi Samrat  Published on  5 Feb 2022 8:14 AM GMT
సాయంత్రం క‌ల్లా ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం లభిస్తుంది : మంత్రి బొత్స

ఈరోజు సాయంత్రంలోగా ఏపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని ఆయ‌న తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చిస్తామని.. ఈరోజు సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌ల తర్వాత ఉద్యోగుల జీతాల నుంచి ఐఆర్‌ను రికవరీ చేయడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. వీటన్నింటిపై చర్చ జరుగుతుందని, తమది స్నేహపూర్వక ప్రభుత్వమని మంత్రి పునరుద్ఘాటించారు.

శుక్రవారం నాటి చర్చలకు సంబంధించి సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాము కోరుతున్న కొన్ని కీలక అంశాలపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని.. చర్చలు సఫలమయ్యేలా కొనసాగుతున్నాయని శుక్రవారం కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, శనివారం నాటికి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది. హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్‌ రికవరీ అంశాలపై తాము సానుకూలంగా ఉన్నామని మంత్రుల కమిటీ సంఘాలకు తెలిపింది.


Next Story