ఏపీలో ఆ 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

AP Curfew Update. ఏపీలో క‌రోనా వ్యాప్తి నేఫ‌థ్యంలో కర్ఫ్యూ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో

By Medi Samrat  Published on  28 Jun 2021 8:16 AM GMT
ఏపీలో ఆ 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

ఏపీలో క‌రోనా వ్యాప్తి నేఫ‌థ్యంలో కర్ఫ్యూ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం.. 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించింది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపులు ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయ‌ని పేర్కొంది. రాత్రి 9 నుంచి 10 గంట‌ల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేతకు అనుమ‌తులు ఇచ్చింది.

ఇక రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకే సడలింపులు ఇచ్చింది ప్ర‌భుత్వం. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ మేర‌కు నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి 7 వరకూ ఈ నిబంధ‌న‌లు అమ‌లులో ఉండ‌నున్న‌ట్లు తెలిపింది. ఆ త‌ర్వాత‌ పాజిటివిటీ రేటు పరిశీలించాక.. ఈ జిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది.


Next Story