అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకనే..జగన్ బల ప్రదర్శన: షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్‌..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 24 Jun 2025 2:00 PM IST

Andrapradesh, Ys Sharmila, Ap Government, Cm Chandrababu, Ys Jagan

అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకనే..జగన్ బల ప్రదర్శన: షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్‌..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో టీడీపీ,జనసేన, వైసీపీ మూడు బీజేపీ పార్టీలే.ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీకి ఊడిగం చేశాడు. YSR కొడుకు అయ్యి ఉండి బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు రాత్రి పడ్డ గొయ్యిలో పగలు పడ్డారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి బాబు, పవన్ ఊడిగం చేస్తున్నారు. బీజేపీ గత 11 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది. ప్రత్యేక హోదా మీద బీజేపీ మోసం చేసింది. పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం చేసింది. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే రాష్ట్ర ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఒక్కరికి బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు. విభజన హామీలు విస్మరిస్తుంటే నోరు మెదపరు..అని షర్మిల విమర్శించారు.

రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత. ఢిల్లీని మించే రాజధాని అంటూ మోసం చేస్తుంటే చంద్రబాబు, పవన్ కనీసం ప్రశ్నించడం లేదు. ఏడాది పాలన అంతా గొప్పల మయం. డబుల్ ఇంజన్ కాదు.. ట్రబుల్ ఇంజన్. సూపర్ సిక్స్ అంతా మోసమే. ప్రతి రైతుకి 20 వేలు ఇస్తా అని ఇంత వరకు ఇవ్వలేదు. రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్తున్నారు. తల్లికి వందనం కింద బిడ్డలను మోసం చేస్తున్నారు. 87 లక్షల మంది పిల్లలు ఉంటే..67 లక్షల మందికి ఇచ్చారు. 20 లక్షల మంది బిడ్డలకు ఎగ్గొట్టారు. నిరుద్యుగ భృతి ఊసే లేదు. మహిళలకు మహిళా శక్తి ఇక లేదు. ఈ పథకాన్ని P4 పథకానికి లింక్ పెట్టారు. ఎన్నికల ముందు p4 కి లింక్ పెడతాం అని ఎందుకు చెప్పలేదు ?...అని షర్మిల పేర్కొన్నారు.

జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం దురదృష్టకరం. జగన్ ఇది గమనించకపోవడం బాధాకరం. ఇది ఫేక్ అని అనడం తప్పు. జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఓడిపోయాక ప్రజల మధ్యకు వస్తున్నారు. ఉనికి కోసం బలప్రదర్శనలు చేస్తున్నారు. జనం మరిచి పోతారని తంటాలు పడుతున్నారు. జగన్ కి ఎందుకు అనుమతి ఇస్తున్నారు ? ప్రజలను ఎందుకు చంపుతున్నారు? కూటమి నిర్లక్ష్యం మీద పోరాటం చేసేది కాంగ్రెస్ మాత్రమే. ప్రతి నెల తాలి బజావో చేస్తున్నాం. మా పోరాటాలకు ఆంక్షలు పెడుతుంటారు. దీక్షలు చేస్తే భగ్నం చేస్తారు. హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. వైసీపీకి ఒక న్యాయం..మాకు ఒక న్యాయమా? జగన్ కి దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తున్నారు. కార్ల కింద ,టైర్ల కింద జనాలను తొక్కే వాళ్లకు అన్ని అనుమతులు ఉంటాయి. ప్రశ్నించకుండా మా గొంతు నొక్కుతారు. మానవత్వం గురించి మాట్లాడే హక్కు జగన్ లేదు. నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది. జగన్ పోరాటాలు అసెంబ్లీ వేదికగా చేయాలి.బయట చేస్తూ అసెంబ్లీ వేదికగా కూడా పోరాటాలు చేయాలి. అసెంబ్లీ కి పోయే దమ్ము లేక బయట మాట్లాడుతున్నారు...అని షర్మిల విమర్శలు గుప్పించారు.

Next Story