ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది హామీలను ఇచ్చింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హామీలను అమలు చేస్తామని పేర్కొంది.

By అంజి  Published on  31 March 2024 1:09 AM GMT
AP Congress, Congress manifesto, loan waiver,farmers, APPolls

ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది హామీలను ఇచ్చింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హామీలను అమలు చేస్తామని పేర్కొంది. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా తొమ్మిది హామీలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా, ప్రతి పేద మహిళకు నెలకు రూ.8,500 మహిళా మహాలక్ష్మి చెల్లింపు, రైతులకు రూ.2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, 50 శాతంతో కూడిన కొత్త కనీస మద్దతు ధర వంటి హామీలను కాంగ్రెస్‌ ఇచ్చింది.

ఇల్లు లేని వారికి రూ.5లక్షలతో ఇల్లు, ఉచిత విద్య కేజీ టూ పీజీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు, వితంతవులకు రూ.4000, వికలాంగులకు రూ.6000 పెన్షన్, మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షలు, రాష్ట్రం ద్వారా 2.25 లక్షల ఉద్యోగాలు, ఉపాధి హామీ కూలీకి రోజుకి కనీసం రూ.400 వేతనం కూడా ఇస్తామని పేర్కొంది.

తెలంగాణ, కర్నాటక ఎన్నికల మాదిరిగానే ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పార్టీ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిలారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం వచ్చిన 1,500 దరఖాస్తుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

'బీజేపీ అంటే బాబు-జగన్-పవన్ తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు తన హయాంలో రాష్ట్రానికి ఎస్‌సీఎస్‌ హోదా కల్పించకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీఎస్‌పై టీడీపీపై వైఎస్ఆర్సీ ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ఐదేళ్లుగా ఎస్‌ఈఎస్‌ ఫ్రంట్‌లో ఏమీ చేయలేదు. ‘ఏపీకి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ మాత్రమే మంజూరు చేయగలదు’ అని షర్మిలారెడ్డి ప్రకటించారు, ఎస్సీఎస్‌ఎస్‌ హోదా వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు.

ఏపీసీసీ చీఫ్ షర్మిల ఏపీలో తన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ (గడప గడపకూ కాంగ్రెస్ పార్టీ) వెళ్లి వైఎస్‌ఆర్‌, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజలను ఎలా మోసం చేశాయో బహిర్గతం చేయాలని కార్యకర్తలను కోరారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తొమ్మిది హామీలను ప్రకటించింది.

Next Story