వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

By Knakam Karthik
Published on : 7 Jun 2025 2:06 PM IST

Andrapradesh, Cm Chandrababu, AP Government, Deputy CM Pawankalyan

వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 12వ తేదీన అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడాదిలో ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు వివరించాలి అని తెలిపారు. ఈ తరుణంలో ఎన్డీయే కూటమి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ.. కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని.. ఎమ్మెల్యేలు అందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు.

ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నా దగ్గర సమాచారం ఉంది అని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పై నమ్మకాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని కోరారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలతో అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీలను నియమిస్తా అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Next Story