గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి వేదిక కావాలి..ఏపీ సీఎం ట్వీట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
By - Knakam Karthik |
గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి వేదిక కావాలి..ఏపీ సీఎం ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సోమవారం (నేటి) నుంచి రెండ్రోజుల పాటు నిర్వహిస్తోన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
My best wishes to the Telangana Rising Global Summit 2025. May this platform open new avenues for growth, innovation and progress. @revanth_anumula@GlobalSummitTG
— N Chandrababu Naidu (@ncbn) December 8, 2025
కాగా, రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025 డిసెంబర్ 8న మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:30 గంటలకు ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా ఆయన సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి పరిశీలిస్తారు. ప్రారంభోత్సవం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. గవర్నర్ డాక్టర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రారంభోపన్యాసం సందర్భంగా, ముఖ్యమంత్రి తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆవిష్కరిస్తున్న భవిష్యత్ అభివృద్ధి రోడ్మ్యాప్తో పాటు, ప్రజా పాలన నమూనా కింద ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో, ప్రపంచ ఆర్థిక వేదికలతో పోల్చదగిన స్థాయిలో నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రపంచ నిపుణులు, అగ్ర నాయకులు పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవం తర్వాత ముఖ్యమంత్రి భారతదేశం, విదేశాలలోని వివిధ రంగాల ప్రతినిధులతో ముఖాముఖి, ప్రతినిధి బృంద సమావేశాలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు, ముఖ్యమంత్రి దాదాపు 15 రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొంటారు, ప్రతి రౌండ్ దాదాపు 15 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది.