పవన్ పై ఈసీకి మరో ఫిర్యాదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది

By Medi Samrat  Published on  24 April 2024 6:45 AM GMT
పవన్ పై ఈసీకి మరో ఫిర్యాదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది. పిఠాపురంలో జరిగిన నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని వినియోగించారంటూ నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని వినియోగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇక జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. జ‌న‌సేనానితో రిట‌ర్నింగ్ అధికారి ప్ర‌మాణం చేయించారు. 'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను' అంటూ ఆయ‌న ప్ర‌మాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జ‌న‌సేన పార్టీ సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది. నామినేష‌న్ వేసేందుకు వ‌చ్చిన ప‌వ‌న్ వెంట ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు, ఎస్‌వీఎస్ఎన్ వ‌ర్మ ఉన్నారు.

Next Story