మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులు : స్పెషల్‌ ఫ్లైట్‌ ఏర్పాటుకు అంగీకరించిన సివిల్‌ ఏవియేషన్‌ శాఖ

Andhra Pradesh govt opens helpline for evacuating students in Manipur. మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా

By Medi Samrat  Published on  7 May 2023 10:00 AM GMT
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులు : స్పెషల్‌ ఫ్లైట్‌ ఏర్పాటుకు అంగీకరించిన సివిల్‌ ఏవియేషన్‌ శాఖ

అమరావతి : మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించారు.

వీరిని ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. వ్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు.


Next Story