విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పోయేలా చేయడమే తమ ప్రభుత్వం ప్రాధాన్యత అంటూ ఆయన మాట్లాడారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పారిశ్రామికవేత్తలు, ధనవంతులు ముందుకు రావాలి. మిలియన్, ట్రిలియన్ డాలర్ల ఆస్తిపరులు ఓవైపు, పూట గడవని పేద వాడు మరోవైపు అన్నట్టుగా ఉన్న అసమానతలు తొలిగేలా పని చేస్తున్నాం. సమాజానికి సేవ చేసే సమయమిది అంటూ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అసమానతలను రూపు మాపాలంటూ సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తల సదస్సులో మాట్లాడారు.
ఇది గివ్ బ్యాక్ టైమ్:
ఒకే సమాజంలో మిలియన్ డాలర్ల ఆస్తిరులు, పూటకు అన్నం దొరకని నిర్భాగ్యులు ఉన్నారు..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలి.. ఇది గివ్ బ్యాక్ టైమ్. ధనవంతులు..పేదలను ఆదుకునే సమయం వచ్చింది. సమాజం నుంచి లాభాలు తీసుకుని ధనవంతులైన వాళ్లు..పేదల బాధ్యత తీసుకోవాలి. ఈ అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం వారధిలా వ్యవహరిస్తోంది. అసమానతలను రూపుమాపేందుకు ప్రభుత్వం పీ-4 విధానాన్ని ప్రమోట్ చేస్తోంది. పూర్-రిచ్ మధ్య మేం బ్రిడ్జిగా ఉంటాం. పాలసీ మేకర్గా పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందించడం నా బాధ్యత.. దీనికి పారిశ్రామిక వేత్తలంతా సహకరించాలి..అని సీఎం కోరారు.