కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం అనుమతి అవసరం లేదు.. అన్ని కార్యాలయాలు ఒకే చోట..

All the offices will be at single place in new districts. కొత్త జిల్లాలపై అభ్యంతరాలను మార్చి 3 వరకు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా

By Medi Samrat  Published on  13 Feb 2022 12:53 PM GMT
కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం అనుమతి అవసరం లేదు.. అన్ని కార్యాలయాలు ఒకే చోట..

కొత్త జిల్లాలపై అభ్యంతరాలను మార్చి 3 వరకు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ ఆదివారం నాడు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 3 వరకు జిల్లాల కలెక్టర్లకు సూచనలను ఇవ్వవచ్చని, అన్ని సమస్యలను పరిష్కరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ను ఆదేశించినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్‌ వెలువడుతుందని విజయ్ కుమార్ తెలిపారు.

మార్చిలో అన్ని జిల్లాల్లో ఉద్యోగుల పదోన్నతులు, వర్క్ టు సర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తూ ఉద్యోగుల విభజన చేపడతామన్నారు. ఉద్యోగుల జోనల్ సమస్యలు రెండే రెండు చోట్ల ఉన్నాయని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తామని, ఎస్పీ కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేస్తామని, 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లను నిర్మిస్తామని చెప్పారు. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని, జిల్లాల ఏర్పాటుకు కేంద్రం అనుమతి అవసరం లేదని అభిప్రాయపడ్డారు.


Next Story