ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో 77మంది మృతి

7796 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 89,732 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  8 Jun 2021 12:11 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో 77మంది మృతి

ఏపీలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 89,732 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 7,796 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,71,007 కి చేరింది. నిన్న 14,641 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,51,790కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, పశ్చిమ గోదావరి లో పది, అనంతపూర్ లో ఎనిమిది, నెల్లూరు లో ఎనిమిది, శ్రీకాకుళం లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, విజయనగరం లో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశం లో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు చొప్పున మొత్తం 77 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11629కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,07,588 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,99,46,253 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story