ఏపీలో క్ర‌మంగా త‌గ్గుతున్న కరోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

749 New Corona Cases reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనా

By Medi Samrat  Published on  13 Feb 2022 12:17 PM GMT
ఏపీలో క్ర‌మంగా త‌గ్గుతున్న కరోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనా కేసులు సంఖ్య ఏడు వంద‌ల‌కుపైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా త‌గ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,785 పరీక్షలు నిర్వహించగా.. 749 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,12,778కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు, నెల్లూరు మరియు ప్రకాశం ఒక్కొక్క రు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,697గా ఉంది. 24 గంటల వ్యవధిలో 6,271 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,79,152కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,929 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,28,31,785 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story