ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

7224 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ

By Medi Samrat  Published on  17 April 2021 12:29 PM GMT
ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 35,907ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 7,224 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ పాజ‌టివ్ కేసుల సంఖ్య 9,55,455కు చేరింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 1051 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ గోదావ‌రిలో 96 కేసులు న‌మోదు అయ్యాయి.

నిన్న ఒక్క రోజే చిత్తూరు జిల్లాలో న‌లుగురు, నెల్లూరు జిల్లాలో ము‌గ్గురు చొప్పున, క‌ర్నూల్‌, విశాఖ జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున‌.. గుంటూరు, కడప, కృష్ణా, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,388కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,332 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,07,598 కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 40,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,56,42,070 శాంపిల్స్ ను పరీక్షించారు.




Next Story