ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా పెరిగిన కేసులు

6996 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోల్చితే కేసులు భారీగా పెరిగాయి

By Medi Samrat  Published on  18 Jan 2022 1:09 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోల్చితే కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,055 పరీక్షలు నిర్వహించగా.. 6,996 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,7384కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,514గా ఉంది. 24 గంటల వ్యవధిలో 1,066 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,66,762కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,19,22,969 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story